నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 14 : మండలంలో పంచ్ సమ్మేళన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఉపాధి నీటి సంరక్షణ పనుల కు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. శుక్రవారం పంచ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొని ఎంపిటిసి లకు, పంచాయతీ స్పెషలాఫీసర్లు, కార్యదర్శులు కు అవగాహన కల్పించారు. మండలంలో విబిజి రాంజీ ఉపాధి హామీ పనులలో భాగంగా చెరువుల నీటి పరివాహక కాలువల లో ట్రెంచీలు, ఫారం పాండ్స్, ఫీడర్ చానల్స్, పండ్ల తోట పెంపకం పై దృష్టి సారించాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతోందని ఈ సమస్యను అధిగమించడానికి పండ్ల తోటల పెంపకం తోపాటు రైతులు ఆరుతడే పంటలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. సాగునీటి బోర్లు లో నీరు ఇంకిపోవడంతో రైతులు వరి పంటలు లేకుండా పండ్ల తోటలు, పశుగ్రాసం వేయడానికి అవగాహన కల్పించాలన్నారు. వి బి జి రాంజీ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి వారికి పనులు కల్పించి కరువు నివారణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రమణ కుమార్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతి కుమార్, ఏపీఓ అంజనప్ప, స్పెషలాఫీసర్ విక్రమ్ రెడ్డి, ఏ ఈ ఓ సురేష్, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News