నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని కృష్ణానగర్ వీధి లో గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య రహదారి సమస్య ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. ఈ సమస్యపై ఓ వర్గం కృష్ణానగర్ లోని వీధిలో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని దీంతో ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారికి వెళ్లడానికి ఇబ్బందిగా తయారైందని తాసిల్దారు శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి రహదారి సమస్య పరిష్కరించాలని వీఆర్వో నాగరాజును ఆదేశించారు. సోమవారం విఆర్ఓ వీఆర్ఏలతో కలిసి ఇరు వర్గాలతో చర్చించి సమన్వయపరిచి రోడ్డుకు అడ్డంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను దగ్గరుండి తొలగింప చేశారు. భవిష్యత్తులో ఎవరు రహదారులకు అడ్డంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం చేయరాదని వీఆర్వో నాగరాజు ఇరువర్గాలకు హెచ్చరించారు. సమస్య పరిష్కారం కావడంతో ఇరువర్గాలు వీఆర్వో కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ప్రసాద్, ఇరు వర్గాల ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News