Thursday, 30 July 2026 05:46:17 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తాహాసిల్దార్ ఆదేశాలతో రహదారి సమస్య పరిష్కారం

Date : 18 May 2026 08:01 PM Views : 316

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని కృష్ణానగర్ వీధి లో గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య రహదారి సమస్య ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. ఈ సమస్యపై ఓ వర్గం కృష్ణానగర్ లోని వీధిలో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని దీంతో ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారికి వెళ్లడానికి ఇబ్బందిగా తయారైందని తాసిల్దారు శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి రహదారి సమస్య పరిష్కరించాలని వీఆర్వో నాగరాజును ఆదేశించారు. సోమవారం విఆర్ఓ వీఆర్ఏలతో కలిసి ఇరు వర్గాలతో చర్చించి సమన్వయపరిచి రోడ్డుకు అడ్డంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను దగ్గరుండి తొలగింప చేశారు. భవిష్యత్తులో ఎవరు రహదారులకు అడ్డంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం చేయరాదని వీఆర్వో నాగరాజు ఇరువర్గాలకు హెచ్చరించారు. సమస్య పరిష్కారం కావడంతో ఇరువర్గాలు వీఆర్వో కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ప్రసాద్, ఇరు వర్గాల ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :