నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత మూడేళ్ల క్రితం తంబళ్లపల్లె, సిద్ధారెడ్డిగారిపల్లి, హలో వీధులలో పెద్ద ఎత్తున మరుగు నీటి కాలువ పనులు చేపట్టారు. కాలవలు నిర్మించి మూతలు వేయకుండా వదిలేశారు. నాటినుండి ఆ కాలువల్లో దుర్గంధం తో దుర్వాసనతో పాటు పలువురు ప్రమాదవశాత్తు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నేటికీ ఆ కాలువ మూతలు వేయడానికి అధికారులు పట్టించుకోవడం తో ఆ దుర్వాసనతో నేటికీ ప్రజలు ఆస్వాదిస్తూనే విమర్శిస్తున్నారు.గత మూడు మాసాల క్రితం సాక్షాత్తు జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలతో2047 విజన్ లో భాగంగా సుమారు కోటి రూపాయలతో తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, కోర్టు వీధి, బస్టాండ్ కాలనీ, సాలె వీధి, కోనేరు వీధి, శ్రీనివాస కాలనీల లో మురికి నీటి కాలువలు, సిసి రోడ్లు శరవేగంగా వేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన కాలువలపై మూతలు వేయడానికి సదరు కాంట్రాక్టర్ కు ఆదేశించడంతో మూతలు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మసీదు వీధి, క్రాస్ రోడ్, పలు వీధులలో వేసిన కాలువలపై మూతలు వేసి దుర్గంధం తో పాటు ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News