నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : నటరారాజు తెలుగుజాతికి కీర్తి ప్రతిష్టలతో పాటు దేశానికి సేవ చేసిన అన్న నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని పార్లమెంట్ జిల్లా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కోరారు. గురువారం ఆయన తంబళ్లపల్లె లో జరిగే మహానాడు ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ తంబళ్లపల్లె మండలంలో టిడిపి నాయకులు ఐకమత్యంతో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై అందరినీ పేరుపేరునా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి డిజిటల్ స్క్రీన్ పై నాయకుల ప్రసంగాలను వీక్షించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొంరెడ్డి, జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొటాల శివకుమార్,పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసి ధర్నాయుడు, సలాది రాజశేఖర్ ,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు
Reporter
Namitha News