Tuesday, 15 September 2026 08:52:33 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు - డిస్ట్రిక్ట్ అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాధిక

Date : 02 April 2026 05:18 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. ఎల్. రాధిక హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్లు, ఐసీటీసీ (ICTC) కౌన్సిలర్లు, వైద్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సమావేశంలో డాక్టర్ రాధిక మాట్లాదుతూ మిషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమం భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు అవసరమైన పరీక్షలు, కౌన్సెలింగ్, చికిత్స సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా హెచ్ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలు మరియు అవసరమైన మందుల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. హెచ్ఐవి నిర్ధారణ అయిన వ్యక్తులకు సమయానికి చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్భాస్కర్ (వెంపల్లె) మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి అవసరమైన హెచ్ఐవి పరీక్షలు మరియు వైద్య సేవలు సమయానికి అందేలా చూడాలని సూచించారు.జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య రంగం సమన్వయంతో పని చేస్తే ఎయిడ్స్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలోని సబ్ సెంటర్లు మరియు ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవి స్క్రీనింగ్ లక్ష్యాలను కనీసం 95 శాతం వరకు సాధించేందుకు కృషి చేయాలని, అలాగే హెచ్ఐవి నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి నిరంతర చికిత్స అందించాలన్నారు.అలాగే వైరల్ లోడ్ నియంత్రణలో 99 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్ఐవి బాధితులకు అవసరమైన వైద్య సేవలు, కౌన్సెలింగ్ మరియు చికిత్స సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీ భాస్కర్, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐసీటీసీ కౌన్సిలర్లు, టి.ఐ. ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :