నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 27 : తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే జయశంకర్ యాదవ్ నియామకంపై టిడిపి నాయకులతో పాటు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జి శంకర్ యాదవ్ సారధ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో విజయ దుందుభి మోగించాలని టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధమ్మ, రామచంద్ర, సోమశేఖర్,కాలా నారాయణ, నరసింహులు, గంగరాజు,వీరాంజనేయులు, శంకర్, చిన్నరెడ్డి, రామకృష్ణ, రషీద్ భాషా, కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News