నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం మదనపల్లె : ఏపీ ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్,టిడిపి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),టిడిపి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజతో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా తులసి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సోదరులకు మట్టి వినాయక ప్రతిమలు,మొక్కలను అందజేస్తూ పఠాన్ ఖాదర్ ఖాన్ గొప్ప మనసును చాటుకుంటున్నారన్నారు.అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆదిదేవుడైన వినాయకుడికి తొలి పూజలు అందించడం ఆనవాయితీ అని,అటువంటి పండుగ నిర్వహణకు ముస్లిం సోదరులు ముందు ఉండడం శుభసూచకన్నారు.ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పఠాన్ ఖాదర్ ఖాన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు.అనంతరం నాగూర్ వలి మాట్లాడుతూ మతసామరస్యానికి మదనపల్లి పట్టణం ఆదర్శంగా నిలుస్తోందని,ముస్లిం,హిందువులు ఐకమత్యంతో ముందుకు సాగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పఠాన్ ఖాదర్ ఖాన్ గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారన్నారు.ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 13వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు తాజ్ హోటల్ ప్రక్కన మట్టి వినాయక ప్రతిమలు,మొక్కలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని,కావున టిడిపి నాయకులు,కార్యకర్తలు,ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Reporter
Namitha News