నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ సృష్టికర్త మాదిగ జాతి పితామహుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంగాధర్ కితాబు నిచ్చారు. శనివారం క్రాస్ రోడ్ లోఅంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి దేశానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అంబేద్కర్ అమర్ రహే హ నినాదాలు చేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ మున్నా , నరసింహులు అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఏపీఓ అంజనప్ప, మాజీ జడ్పిటిసి రామచంద్ర, తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటామల్లికార్జున, వెంకటప్ప, బొజ్జప్ప, గోపి దిన్నె మల్లికార్జున, హరిబాబు, పకీరప్ప, రమణప్ప, గోవిందు, వెంకటరమణ, నరసింహులు, భాష, పుల్లప్ప బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News