నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్11: తంబల్లపల్లి మండలం దాదం వడ్డిపల్లి గ్రామం లో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.గురుస్వామి బండి రెడ్డిమల్లు, డేరంగుల రాంమూర్తి, దేవరింటి రాజు, భానుప్రకాశ్, ఉప్పుతోళ్ల జగదీష్ ల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.పంచామృతాలతో అయ్యప్పకు అభిషేకం అయ్యప్ప 18 మెట్ల పై పడి వెలిగించడం, అత్యంత వైభవంగా కనువిని ఎరుగని రీతిలో శబరిమలై వెళ్లలేని వా రికి, శబరిమలలో అయ్యప్పకు ఏ విధంగా అయితే అభిషేక కార్యక్రమం జరుగుతుందో అదేవిధంగా దాదంవడ్డిపల్లి గ్రామంలో కార్యక్రమం జరిగింది. ఈ మహా పడిపూజ కార్యక్రమం కు పెద్ద ఎత్తున స్వాములు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరవడం జరిగింది,ఈ కార్యక్రమంకి గురు స్వామి రెడ్డిమల్లు అయ్యప్ప స్వాముచే పేట తుళ్ళి ఆడుతూ భజనలు చేయడం జరిగింది.పడి పూజ అనంతరం స్వాములకు, చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన నటువంటి అయ్యప్ప భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు,ముఖ్యంగా బుడ్స్ రమణ దాదంవడ్డిపల్లి లోని ప్రజలకు,తంబల్లపల్లి మండలంలోని చుట్టుపక్కల అయ్యప్పస్వామి భక్తులకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ఏటీగడ్డపల్లి శ్రీనివాసులు,బాలు,ఆనంద, అనిల్ కుమార్,ఉమశంకర్,ఉదయ్ కిరణ్, ఈశ్వరప్ప, శంకర,సహదేవ,పెద్ద భద్రి చిన్న భద్రి, ఇతర అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
Reporter
Namitha News