నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి -మే 13 : తంబళ్లపల్లి నియోజకవర్గం లోని కురబలకోట మండలం ఎగువ చెన్నా మర్రి గ్రామం లో వెలసియున్న "ఏనుగు మల్లమ్మ " జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమయానికి వర్షాలు పడి, పాడి పంటలతో గ్రామం శుభిక్షంగా ఉండాలని శ్రీరామ్ ఆకాక్షించారు. ప్రజలు, కార్యకర్తలు శ్రీరామ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ యాదవ్, నరసింహ యాదవ్, వాల్మీకి స్టేట్ డైరెక్టర్ ప్రభాకర్, చీకులభైల్ శ్రీకాంత్, రవి, శివ, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, శ్యామ్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News