Thursday, 30 July 2026 05:35:24 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ముద్దల దొడ్డి లో దేవర ఎద్దు మృతి ఘనంగా అంత్యక్రియలు

Date : 08 January 2026 08:08 PM Views : 470

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 ః తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి (బాలిరెడ్డిగారిపల్లి) పంచాయతీ ఎగువ ముట్ర వారి పల్లి కు చెందిన ముట్ర కుటుంబాలకు చెందిన దేవర ఎద్దు బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. గత పది రోజులుగా ఎద్దు కు కంటి వద్ద గాయమై అస్వస్థతకు గురి అయింది. మెరుగైన చికిత్సలు చేయించిన ఫలితం లేక ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గ్రామ దేవతగా పూజిస్తున్న దేవరఎద్దు మృతితో ముద్దల దొడ్డి పంచాయతీ మూగబోయింది.గురువారం ముట్రవారి దేవర పెద్ద కె. నరసింహారెడ్డి, దేవర ఎద్దు భక్తుడు ఎం. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హిందూ సంస్కృతి సాంప్రదాయ బద్దంగా దేవర ఇంటి వద్ద ఎద్దు మృతదేహానికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వందలాదిగా ముట్ర కుటుంబీకులు, మహిళలు, ప్రజలు దేవర ఎద్దు కు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ట్రాక్టర్ లో ఊరేగింపుగా దేవర ఎద్దును ఊరేగించి ఖననం చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేలుళ్లు, డప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దేవర ఎద్దును అశ్రు నయనాలతో సాగనంపారు. ఈ కార్యక్రమానికి ముద్దలదొడ్డి పంచాయితీ తోపాటు మండలంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దేవరెద్దు అంత్యక్రియల్లో పాల్గొనడం విశేషం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :