నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి పరిధిలోని తురకపల్లిలో వినాయక చవితి వేడుకలను యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువత కమిటీ సభ్యులు ముందుండి పండుగ ఏర్పాట్లను చేపట్టి, భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని యువత కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యువత కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తురకపల్లి ప్రజలందరూ విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరారు. పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి వేడుకలు వైభవంగా జరగడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు సాయి గణేష్, చంటి, శేఖర్, వినోదం, రవి, శ్రీనివాసులు, రెడ్డి,మహేష్, సాయి పవన్,నాగతేజ,భారత్,నాగార్జున,తరుణ్, ఉదయ్,అశోక్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Reporter
Namitha News