Thursday, 30 July 2026 10:09:00 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దేశ సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మదనపల్లెలో ఘనంగా వర్ధంతి వేడుకలు

Date : 21 May 2026 04:05 PM Views : 100

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దేశ సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మదనపల్లెలో ఘనంగా వర్ధంతి వేడుకలు విశాలాంధ్ర, మదనపల్లి: దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి, భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహానేత స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్‌.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మదనపల్లె పట్టణంలోని ఇందిరా నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్‌.అల్లా బకష్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య, సాంకేతికత, టెలికమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఐటీ రంగానికి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. గ్రామ స్వరాజ్య సాధనకు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యంలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని తెలిపారు. సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఈ రోజును దేశంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన మహానేతగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, మాజీ మండలాధ్యక్షులు ముబారక్ ఖాన్, మాజీ డీసీసీ సెక్రటరీ డా.వర్ధన్ చౌదరి, మాజీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మహబూబ్ పేరా, మాజీ మహిళా టౌన్ ప్రెసిడెంట్ ఈశ్వరమ్మ, మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు నాగరాజ, మాజీ టౌన్ సెక్రటరీలు పాలేటి, మహమ్మద్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు శరత్ కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు యూసుఫ్ ఖాన్, ఇర్ఫాన్, దస్తగిరి ఖాన్, ఉస్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :