నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 17 : తంబళ్లపల్లె మండలం ఆర్ ఎం తండా ఎద్దులవారి కోట అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ మాట్లాడుతూ తల్లులు, గర్భవతులు, బాలింతలు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల వల్ల అనేక దుష్ప్రభావాలు సంభవిస్తాయని కావున బాలికలకు 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార స్టాల్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు బురుజు పల్లి రమణమ్మ, ఆర్ ఎన్ తాండా సుగుణ, ఎద్దుల వారి కోట ప్రమీలమ్మ, ఎద్దుల వేమన్న గారి పల్లె నాగరత్న హెల్పర్లు, తల్లులు, గర్భవతులు , బాలింతలు పాల్గొన్నారు
Reporter
Namitha News