Wednesday, 16 September 2026 12:54:56 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

నకిలీ ధృవపత్రాలతో పాస్‌పోర్ట్ పొందడానికి యత్నం - నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, 5వేల రూ జరిమానా

Date : 27 January 2026 08:23 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 27: తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్ పొందేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన వ్యక్తికి రాయచోటి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో నిందితుడైన షేక్ వసీం అక్రమ్‌కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ గౌరవనీయ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ టి. సుయోధన గారు మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాయచోటి టౌన్ అలీమాబాద్ వీధికి చెందిన ఖాజా హుస్సేన్ కుమారుడు షేక్ వసీం అక్రమ్ 2023 నవంబర్ 5న ECNR పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా అతను తన పదవ తరగతి మార్కుల మెమోను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించి అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు.వసీమ్ అక్రమం పై అప్పటి ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సీఐ సుధాకర్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడి పై క్రైమ్ నంబర్ 168/2023 కింద సెక్షన్ 420, 464, 468 (IPC) ప్రకారం కేసు నమోదు చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ సాయి రామకృష్ణ పటిష్టమైన వాదనలు వినిపించారు. నేరం నిరూపితం కావడంతో, న్యాయమూర్తి నిందితుడు వసీమ్ అక్రమ్ కి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, 5వేల రూ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: