నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 11 : తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నికను అబ్సర్వర్ జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ పర్యవేక్షణ లో ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాపూజీ పట్నాయక్ లు ఎన్నిక నిర్వహించగా తంబళ్లపల్లి ఎంపీపీ గా వైయస్ ఆర్ సిపి కి చెందిన కోసువారిపల్లి ఎంపీటీసీ సిటీకి శ్యామలమ్మ ఒక్కటే నామినేషన్ వేయడం తో 11మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా పది మంది హాజరు ఒక్క ఎంపీటీసీ సభ్యురాలు అయిన మాజీ ఎంపీపీ అనసూయమ్మ గైర్ హాజరు కావడం తో మిగిలిన తొమ్మిది మంది సభ్యులు శ్యామలమ్మ ను ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీ సభ్యురాలు హరిత, కన్నెమడుగు ఎంపీటీసీ సభ్యులు రెడ్డి మహేష్ లు ప్రతిపాదించడం తో సభ్యులు అందరూ ఏకగ్రీవం గా ఆమోదం తెలుపడం తో ఎంపీపీ గా శ్యామలమ్మ ఎన్నికైనట్లు తెలిపిన ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో యస్.ఐ. ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్ నిర్వహించిన పోలీసులు.
Reporter
Namitha News