Saturday, 12 September 2026 03:47:39 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పథకాల అమలు 100 శాతం కావాలి – పి.వి.పి వెంకటప్ప

Date : 17 April 2026 07:47 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది పథకాల అమలు 100 శాతం కావాలి – కాలనీల్లో మౌలిక వసతులు తప్పనిసరి: పి.వి.పి వెంకటప్ప గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వి.పి వెంకటప్ప స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గిరిజనులందరికీ వందశాతం చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా సందర్శించిన ఆయన గిరిజన ప్రాంతాల పరిస్థితిని విశ్లేషించి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 50 వేల గిరిజన జనాభా ఉన్న నేపథ్యంలో వారి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం గిరిజన సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజనులకు ఎలాంటి లోటు లేకుండా పథకాలు అందేలా కృషి జరుగుతోందన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో గిరిజనులకు అందుతున్న లబ్ధులు, పథకాల అమలు, రిజర్వేషన్ అమలు, నిధుల వినియోగంపై పూర్తి వివరాలను నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గిరిజన కాలనీలలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, గృహ వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా స్మశాన వాటికల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆధార్ కార్డుల లేమి కారణంగా పింఛన్లు, రేషన్ వంటి సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ప్రతి కాలనీలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. హాస్టళ్లలో తాగునీటి సమస్యలు, విద్యలో వెనుకబాటుతనం, వలస సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. “చదువే గిరిజనుల భవిష్యత్తు” అని పేర్కొంటూ విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించి ప్రతి తాండా, కాలనీలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి పరిహారం చెల్లింపుల వరకు అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని పోలీసు శాఖకు సూచించారు. మున్సిపల్ పరిధిలో షాపులను రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్టీలకు కేటాయించడం తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో నమోదైన 41 అట్రాసిటీ కేసుల్లో 39 కేసులకు రూ.24.66 లక్షల పరిహారం చెల్లించినట్లు అధికారులు వివరించగా, మిగిలిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో గిరిజనులు రహదారులు, గృహాలు, పింఛన్లు, ఆధార్ కార్డులు, స్మశాన వాటికలు, భూమి సమస్యలపై వినతులు సమర్పించారు. జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కే. తేజస్విని, డీఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :