Monday, 08 June 2026 09:51:48 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ - కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

Date : 14 April 2026 12:33 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భాతర రాజ్యాంగ రూపశిల్పిగా, సమానత్వమే ఊపిరిగా ప్రపంచ దేశాల ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప వ్వక్తి అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎందరో జీవితాలలో మార్పునకు స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పని చేద్దామని నినాదాలు చేశారు. అనంతరం రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహనీయునికి స్మరించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జయంతి జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ దార్శనికుడుగా పేరుపొందిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మహనీయుడు అన్నారు.‌ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనలో అందరూ భాగస్వాములై నవభారత నిర్మాణానికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాజీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ కుమార్ రెడ్డి, టౌన్ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, నిమ్మనపల్లి మండల మాజీ బీసీ అధ్యక్షులు ఆర్ నాగరాజు, మదనపల్లి పట్టణ మాజీ సెక్రెటరీ మహమ్మద్ అలీ, జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మదనపల్లి టౌన్ మాజీ బీసీ ఉపాధ్యక్షులు పాలేటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ నాయక్, సమీర్, వెంకటరమణ, భయారెడ్డి, సమీవుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :