నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భాతర రాజ్యాంగ రూపశిల్పిగా, సమానత్వమే ఊపిరిగా ప్రపంచ దేశాల ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప వ్వక్తి అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎందరో జీవితాలలో మార్పునకు స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పని చేద్దామని నినాదాలు చేశారు. అనంతరం రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహనీయునికి స్మరించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జయంతి జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ దార్శనికుడుగా పేరుపొందిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మహనీయుడు అన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనలో అందరూ భాగస్వాములై నవభారత నిర్మాణానికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాజీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ కుమార్ రెడ్డి, టౌన్ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, నిమ్మనపల్లి మండల మాజీ బీసీ అధ్యక్షులు ఆర్ నాగరాజు, మదనపల్లి పట్టణ మాజీ సెక్రెటరీ మహమ్మద్ అలీ, జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మదనపల్లి టౌన్ మాజీ బీసీ ఉపాధ్యక్షులు పాలేటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ నాయక్, సమీర్, వెంకటరమణ, భయారెడ్డి, సమీవుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News