Monday, 14 September 2026 08:00:06 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ - కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

Date : 14 April 2026 12:33 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భాతర రాజ్యాంగ రూపశిల్పిగా, సమానత్వమే ఊపిరిగా ప్రపంచ దేశాల ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప వ్వక్తి అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎందరో జీవితాలలో మార్పునకు స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పని చేద్దామని నినాదాలు చేశారు. అనంతరం రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహనీయునికి స్మరించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జయంతి జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ దార్శనికుడుగా పేరుపొందిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మహనీయుడు అన్నారు.‌ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనలో అందరూ భాగస్వాములై నవభారత నిర్మాణానికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాజీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ కుమార్ రెడ్డి, టౌన్ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, నిమ్మనపల్లి మండల మాజీ బీసీ అధ్యక్షులు ఆర్ నాగరాజు, మదనపల్లి పట్టణ మాజీ సెక్రెటరీ మహమ్మద్ అలీ, జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మదనపల్లి టౌన్ మాజీ బీసీ ఉపాధ్యక్షులు పాలేటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ నాయక్, సమీర్, వెంకటరమణ, భయారెడ్డి, సమీవుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :