నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 21 ః తంబళ్లపల్లె మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం తంబళ్లపల్లె పెద్ద మసీదుకు చెందిన ముస్లిం సోదరులు మసీదు నుండి ఘరాన్ ఆలా పిస్తూ క్రాస్ రోడ్లోని ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ యూసుఫ్ రంజాన్ పండుగ పవిత్రత, మత ప్రవక్త సూక్తులు, విశేషాలను తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు దానధర్మాలు నిర్వహించారు. మండలంలోని కోసువారిపల్లె,గోపి దిన్నె, కొటాల, గంగిరెడ్డిపల్లి, కుక్క రాజు పల్లి, ఎద్దుల వారి పల్లి మసీదులలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Reporter
Namitha News