నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 20 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్బంగా మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు Y జంక్షన్ లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన ఆర్.టి.ఓ. అధికారులు, వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యం.వి. ఇన్స్పెక్టర్లు. కరపత్రాలు పంపిణీ చేసిన సిబ్బంది. ఈ సందర్బంగా యం.వి.ఐ. దినేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లా రవాణా శాఖ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆదేశాల మేరకు జనవరి 8వ తేదీ నుండీ 18వ తేదీ వరకూ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ప్రవేట్ ట్రావెల్స్ పై నిఘా ఉంచి తనిఖీలు చేసే క్రమంలో ప్రయాణికుల వద్ద నుండీ అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులపై 41 కేసులు నమోదు చేసి రూ 4.10 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు, పన్నులు చెల్లించకుండా ఉండటం, చట్టాన్ని అతిక్రమించడం వాటి పై 15 కేసులు నమోదు చేసి రూ 32వేల రూపాయలకు పైగా అపరాదం వేసామని తెలిపారు. ఈ కార్యక్రమం లో యం.వి.ఐ. లు, ఏ.యం.వి.ఐ. లు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News