నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 14: మదనపల్లి పట్టణం అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కెరీర్స్360 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్–2026 లో దేశంలోని ఉత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల జాబితాలో స్థానం సంపాదించి “AAAA” రేటింగ్ను పొందినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన మరియు ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానం, విద్యార్థుల ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నైపుణ్యం వంటి పలు ప్రమాణాల ఆధారంగా నిర్వహించిన సమగ్ర మూల్యాంకనంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం విద్యా నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలు మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తోందన్నారు. కెరీర్స్360 అందించిన ఈ రేటింగ్ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు మరియు అత్యుత్తమ ప్లేస్మెంట్ అవకాశాల ద్వారా విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తోందన్నారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ లు అభినందనలు తెలిపారు. అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ & రీసెర్చ్, ఇండస్ట్రీ కనెక్ట్, ప్లేస్మెంట్ సక్సెస్ రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ఈ గుర్తింపు లభించడం పై హర్షం వ్యక్తం చేసారు
Reporter
Namitha News