Sunday, 13 September 2026 07:46:13 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రూమాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో యం.ఓ.యు. కుదుర్చుకొన్న మిట్స్

Date : 21 February 2026 05:01 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 21 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం వారు బెంగళూరుకు చెందిన రూమాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రూమాన్ టెక్నాలజీస్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి మరియు సీనియర్ టెక్నికల్ మేనేజర్ వెంకట్ బి. రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్ అవకాశాలను విస్తరించుకోవచ్చని అన్నారు. తమ సంస్థ కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల ద్వారా పలు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ఆ ప్రాజెక్టుల అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించి ఆధునిక సాంకేతిక రంగాల్లో వారి నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఉపాధి హామీ కల్పించే విధంగా ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందిస్తామని, విద్య పూర్తయ్యే సమయానికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా అనుసంధానాన్ని బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఇంటర్న్‌షిప్‌లు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు మరియు ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్త్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్ -స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :