నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అభయ ఫౌండేషన్ వారి అభయ భవిత కార్యక్రమాల ద్వారా ఇవాళ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు దాదాపు 800 మంది విద్యార్థిని, విద్యార్థులకు సేఫ్టీ గురించి అవగాహనను అందించిన .. అభయ భవిత సర్టిఫైడ్ ట్రైనర్ Dr. స్వాతి చక్రపాణి .ఈ అభయ భవిత పది సూత్రాలను అన్నమయ్య జిల్లాలోని ప్రతి స్కూల్ నందు తెలియజేస్తున్నాము ఇందులో భాగంగా ఇవాళ కూడా బ్రిలియంట్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు సేఫ్టీ గురించి తెలియజేస్తున్నాం అని ఆమె అన్నారు. ఇందులో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల నుంచి స్వీయ రక్షణ, నిర్భయంగా ఉండడం, సేఫ్టీ టూల్స్ ను కలిగి ఉండటం, ఏదేని విపత్కర పరిస్థితుల్లో ప్రతిఘటించటం, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లు మొదలగు పిల్లల సామాజిక రక్షణ అంశాల మీద 45 నిమిషాలు అవగాహన కార్యక్రమం జరిగింది.. శ్రీ అభయ బాలచంద్ర గురూజీ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 10 రక్షణ సూత్రాలను అభయ ఫౌండేషన్ ద్వారా దేశంలోని విద్యార్థిని విద్యార్థులందరికీ చేరవేయాలన్నది దృఢ సంకల్పంతో ఈ అభయ భవిత కార్యక్రమం పనిచేస్తుందని మీ సందర్భంగా.. ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ & అభయ భవిత సర్టిఫైడ్ ట్రైనర్ Dr. స్వాతి చక్రపాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 763 మంది విద్యార్థులు,30 మంది బ్రిలియంట్ స్కూల్ టీచర్లు, స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు, అభయ భవిత టీం పాల్గొన్నారు.
Reporter
Namitha News