నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 10 ః తంబళ్లపల్లె మండలం లో విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి, ఏ ఈ సురేంద్ర ఆదేశాల మేరకు విద్యుత్ సిబ్బంది మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్లు పరిధిలో ముమ్మరంగా మరమ్మత్తు పనులు చేపట్టారు. శనివారం ఉదయం 9 గంటలనుండి 12 గంటల వరకు తంబళ్లపల్లె, కన్నె మడుగు, కుక్కరాజుపల్లి, కోసువారిపల్లి, గోపిదిన్నె సబ్స్టేషన్లలో లెవెన్ కె.వి ఎల్.ఏ.ఎస్ బిగింపు, మెయింటెనెన్స్ పనులు పూర్తి చేశారు. అదేవిధంగా సబ్ స్టేషన్లలో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర, నాగేంద్ర, అనిల్, ఇంతియాజ్, నాగేంద్రబాబు, శేషు, కాలేశా, రమేష్, సురేష్, ప్రవీణ్, రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News