నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 05 : గుర్రంకొండ గ్రామపంచాయతీ నందు జగన్ కాలనీలో చర్చి కోసం స్థలం కేటాయించడం నిలుపుదల చేయాలని స్థానిక హిందూ నాయకులు, బిజెపి జనసేన నాయకులు మండల తహసిల్దారుని కోరారు. హిందూ నాయకులు మాట్లాడుతూ జగన్ కాలనీలో హిందూ, ముస్లిం ప్రజలు మాత్రమే ఉన్నారని, క్రిస్టియన్లు ఎవరూ లేకపోయినా వారికి చర్చి స్థలం కేటాయిస్తే, చర్చి నిర్వాహకులు చేసే మతమార్పిడులు వల్ల మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు రామాంజులు. జనసేన గోపాలకృష్ణ. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి. బిజెపి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ భరత్. సమరత సేవ ఫౌండేషన్ మండల కన్వీనర్ చలపతి. గౌరీ హోటల్ శ్రీనివాసులు.రమణ. రాజా మొదలగు వారు పాల్గొన్నారు.
Reporter
Namitha News