Wednesday, 29 July 2026 10:23:59 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కోకిల బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి

మున్సిపల్ కౌన్సిల్ మీటిలో మహిళా కౌన్సిలర్ ఆవేదన

Date : 22 December 2025 06:26 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కోకిల బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకో... మున్సిపల్ కౌన్సిల్ మీటిలో మహిళా కౌన్సిలర్ ఆవేదన... సోమవారం మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ మనూజా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.. బడ్జెట్ సమావేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణ, జమ ఖర్చులపై చర్చ జరగాల్సి ఉండగా అధికార పార్టీ కౌన్సిల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని సభలో తీర్మానం చేశారు.. ఈ సమావేశంలో స్థానిక మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న కోకిల బార్ నిర్వహణ వలన తమ వీధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళలు మరీ ఎక్కువగా అవమానింప పడుతున్నారని మహిళా కౌన్సిలర్ ఫర్జానా కౌన్సిల్ మీట్లో ఆవేదన వ్యక్తం చేసింది, కోకిల బార్ వల్ల తాగుబోతులతో మహిళలు అటుగా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందని, చిన్నపిల్లలు అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నారని, వీధిలో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ కుటుంబాల నివాసం ఉంటున్న సందర్భంగా కోకిల బార్ నిర్వాహనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని మహిళా కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేసింది, దీనిపైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రమీల, చైర్ పర్సన్ మనూజ రెడ్డిలకు వినతి పత్రం సమర్పించింది. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని తమ వీధిలోని ప్రజలకు న్యాయం చేయాలని కోరింది.. కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ లు జింక వెంకటా చలపతి, నూర్ ఆజం , కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, నాగార్జున బాబు, శ్రీనివాసులు , శివయ్య, ఈశ్వర నాయక్, రాజేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :