నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కోకిల బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకో... మున్సిపల్ కౌన్సిల్ మీటిలో మహిళా కౌన్సిలర్ ఆవేదన... సోమవారం మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ మనూజా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.. బడ్జెట్ సమావేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణ, జమ ఖర్చులపై చర్చ జరగాల్సి ఉండగా అధికార పార్టీ కౌన్సిల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని సభలో తీర్మానం చేశారు.. ఈ సమావేశంలో స్థానిక మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న కోకిల బార్ నిర్వహణ వలన తమ వీధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళలు మరీ ఎక్కువగా అవమానింప పడుతున్నారని మహిళా కౌన్సిలర్ ఫర్జానా కౌన్సిల్ మీట్లో ఆవేదన వ్యక్తం చేసింది, కోకిల బార్ వల్ల తాగుబోతులతో మహిళలు అటుగా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందని, చిన్నపిల్లలు అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నారని, వీధిలో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ కుటుంబాల నివాసం ఉంటున్న సందర్భంగా కోకిల బార్ నిర్వాహనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని మహిళా కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేసింది, దీనిపైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రమీల, చైర్ పర్సన్ మనూజ రెడ్డిలకు వినతి పత్రం సమర్పించింది. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని తమ వీధిలోని ప్రజలకు న్యాయం చేయాలని కోరింది.. కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ లు జింక వెంకటా చలపతి, నూర్ ఆజం , కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, నాగార్జున బాబు, శ్రీనివాసులు , శివయ్య, ఈశ్వర నాయక్, రాజేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు...
Reporter
Namitha News