నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 29 : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యునిగా రాయచోటి పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసి సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ కి రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన రాస్కో ఫోర్ట్ కమిటీ కోఆర్డినేటర్ గా నియతులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి. అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు పి.వి మిథున్ రెడ్డి గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాయలసీమకు సాగునీటి హక్కులు,లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధన,పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి,ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అవుతానని తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించి రాయలసీమ ప్రయోజనాల సాధనకు కృషి చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తిరగడానికి శక్తి గురించి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాయలసీమ అభివృద్ధి కోసం పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తానని సిబ్యాల విజయభాస్కర్ ఆయన స్పష్టం చేశారు.తనకు సహా,సహకారాలు అందిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు
Reporter
Namitha News