నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 29 : వాహన చోదకులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు తప్పక పాటించాలని ఎస్సై టి అనిల్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించి, మద్యం సేవించి బండి నడప రాదని, అతివేగం తో పాటు చిన్న పిల్లలకు వాహనాలు వివరాలని సూచించారు. వాహన రికార్డులు కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అసాంఘిక శక్తులు అల్లర్లు, దౌర్జన్యాలు, గలాటాలు చేస్తే ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు
Reporter
Namitha News