Thursday, 30 July 2026 07:48:47 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శేష వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

Date : 20 January 2026 11:45 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 :ః తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉదయం శేష వాహనం సాయంత్రం హంస వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆగమ శాస్త్ర ప్రకారం శాస్రోత్తకంగా స్వామివారికి టీటీడీ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి ల బృందం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో శేష వాహనం పై ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని హంస వాహనంపై మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలతో మాడవీధులతోపాటు కోసువారిపల్లి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిగా భక్తజన సందోహం ఊరేగింపులో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది నగేష్, కృష్ణమూర్తి, మురళి భక్తులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :