Wednesday, 29 July 2026 10:22:16 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జగనన్న లేఅవుట్ పేరుతో ప్రభుత్వ భూమి వృధా - టిడిపి నాయకుల విమర్శ

Date : 28 December 2025 11:40 AM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 27 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ లోని నిరుపేదలకు అప్పటి వైకాపా ప్రభుత్వం జగనన్న లేఔట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు సుమారు రూ 14 లక్షలు 1.50 ఎకరాల భూమి కొని కేటాయించారు. అప్పట్లో ఆ స్థలం పక్కనే స్మశానం తో పాటు చెరువుకు దగ్గరగా ఉండి చౌడు భూమి తో పాటు ఊటు పట్టడం తో నివాసాలకు యోగ్యంగా లేకపోవడంతో నిరుపేద లబ్ధిదారులు ఆ స్థలాన్ని తీసుకోకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. జగనన్న లేఔట్ పేరుతో లక్షల రూపాయలతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంపై మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, పార్లమెంట్ రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డిలు విమర్శించారు. ఈ విషయమై వారు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఔట్ పేరుతో ఎందుకు పనికిరాని ప్రైవేట్ భూమిని కొని నిరుపేదలను మోసం చేసిందని దుయ్యబట్టారు. నిరుపయోగంగా ఉన్న ఈ భూమిని కోసువారిపల్లి ప్రజలకు స్మశాన వాటిక ఏర్పాటుకు కేటాయించడానికి ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :