నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 27 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ లోని నిరుపేదలకు అప్పటి వైకాపా ప్రభుత్వం జగనన్న లేఔట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు సుమారు రూ 14 లక్షలు 1.50 ఎకరాల భూమి కొని కేటాయించారు. అప్పట్లో ఆ స్థలం పక్కనే స్మశానం తో పాటు చెరువుకు దగ్గరగా ఉండి చౌడు భూమి తో పాటు ఊటు పట్టడం తో నివాసాలకు యోగ్యంగా లేకపోవడంతో నిరుపేద లబ్ధిదారులు ఆ స్థలాన్ని తీసుకోకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. జగనన్న లేఔట్ పేరుతో లక్షల రూపాయలతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంపై మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, పార్లమెంట్ రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డిలు విమర్శించారు. ఈ విషయమై వారు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఔట్ పేరుతో ఎందుకు పనికిరాని ప్రైవేట్ భూమిని కొని నిరుపేదలను మోసం చేసిందని దుయ్యబట్టారు. నిరుపయోగంగా ఉన్న ఈ భూమిని కోసువారిపల్లి ప్రజలకు స్మశాన వాటిక ఏర్పాటుకు కేటాయించడానికి ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News