Monday, 14 September 2026 06:54:31 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆసుపత్రి లో సేవాభావంతో పనిచేయాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాషా

సర్వజన ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 29 May 2026 07:06 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ ఆసుపత్రిలో సేవాభావంతో పనిచేయాలి ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగుల పట్ల సేవాభావంతో సిబ్బంది పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్‌తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 200 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్న ఆసుపత్రిలో రోజుకు 400 మందికి పైగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది గైర్హాజరు కాకుండా విధులను సక్రమంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సార్ షంషీర్, బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మెడికల్ షాపు రమేష్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్, రెడ్డి రాయల్, చెల్లా, బాలమణి శేఖర్, మంగళ ప్రభాకర్, కాశీ శ్రీరామ్, పసుపులేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :