నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఆగస్ట్ 07 : డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ నాయకులు సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులు తొలగించాలని కూడా కోరారు.
Reporter
Namitha News