Thursday, 16 April 2026 06:45:20 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఘనంగా సిపిఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం

Date : 26 December 2025 02:39 PM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 26 : భారత కమ్యూనిస్టు పార్టీ 101 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారంవారం ఉదయం 10 గంటలకు చిన్నతిప్పసముద్రం గ్రామ శాఖ మరియు మదనపల్లె పార్టీ కార్యాలయంవద్ద జెండా దిమ్మె లు వద్ద సిపిఐ *జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఇటీవల మరణించిన సిపిఐ నాయకులు ఎర్రజెండా నీడన ఒరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలని,ఇంక్వి లాబ్ జిందాబాద్, క్యాపిటలిజం నశించాలని, సోషలిజం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. లాల్ జెండా పోరాటాలకు నీల్ లాల్-నీల్ జెండాలు ఏకమై బడుగుబలహీన వర్గాల సమస్యలమీద ఐక్య పోరాటాల కోసం తాము ఇప్పుడు ముందు ఉంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి కే మురళి లు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ పాలకుల నిర్బంధ కాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భించిందని,గడచిన 100 ఏళ్ల కాలంలో ఎన్నో విరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సిపిఐ ప్రతీకగా నిలిచిందన్నారు.అనేక కుట్రలు,కుతంత్రాలు, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఎందరో నేతలు జైలుకు వెళ్లడం,ఉరికంబం ఎక్కడం ద్వారా స్వాతంత్ర్య సమరంలో అగ్రభాగాన ఉండి పోరాడిన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు.నాడు తెల్లదొరతనాన్ని తరిమికొట్టినప్పటికీ నేడు నల్ల దొరతనం రాజ్యమేలుతోందని, ఏనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఛాయలు కనిపించని ఆర్.ఎస్.ఎస్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకుని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వాన్ని దాని సహవాస పార్టీలను గద్దెదించాలనే సంకల్పంతో, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవ్యవస్థను పరిరక్షించుకునే ఆశయంతో కమ్యూనిస్టులు కంకణబద్దులు కావలసిన తక్షణవసరం ఉందని అన్నారు. అనంతరం పార్టీ నియమాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లె మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ సిపిఐ మదనపల్లె పట్టణ కార్యదర్శి జి చంద్రశేఖర్ మాధవ్ శాఖ కార్యదర్శి కే సిద్దయ్య గోపాల్ నిళవతి రాజమ్మ భాగ్యమ్మ వెంకటమ్మ పాపుల్లమ్మ శివుణ్ణి మల్లేష్ గజేంద్ర రమణమ్మ నాగరత్నమ్మ క్రిష్ణప్ప మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :