నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 26 : భారత కమ్యూనిస్టు పార్టీ 101 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారంవారం ఉదయం 10 గంటలకు చిన్నతిప్పసముద్రం గ్రామ శాఖ మరియు మదనపల్లె పార్టీ కార్యాలయంవద్ద జెండా దిమ్మె లు వద్ద సిపిఐ *జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఇటీవల మరణించిన సిపిఐ నాయకులు ఎర్రజెండా నీడన ఒరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలని,ఇంక్వి లాబ్ జిందాబాద్, క్యాపిటలిజం నశించాలని, సోషలిజం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. లాల్ జెండా పోరాటాలకు నీల్ లాల్-నీల్ జెండాలు ఏకమై బడుగుబలహీన వర్గాల సమస్యలమీద ఐక్య పోరాటాల కోసం తాము ఇప్పుడు ముందు ఉంటామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి కే మురళి లు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ పాలకుల నిర్బంధ కాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భించిందని,గడచిన 100 ఏళ్ల కాలంలో ఎన్నో విరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సిపిఐ ప్రతీకగా నిలిచిందన్నారు.అనేక కుట్రలు,కుతంత్రాలు, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఎందరో నేతలు జైలుకు వెళ్లడం,ఉరికంబం ఎక్కడం ద్వారా స్వాతంత్ర్య సమరంలో అగ్రభాగాన ఉండి పోరాడిన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు.నాడు తెల్లదొరతనాన్ని తరిమికొట్టినప్పటికీ నేడు నల్ల దొరతనం రాజ్యమేలుతోందని, ఏనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఛాయలు కనిపించని ఆర్.ఎస్.ఎస్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకుని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వాన్ని దాని సహవాస పార్టీలను గద్దెదించాలనే సంకల్పంతో, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవ్యవస్థను పరిరక్షించుకునే ఆశయంతో కమ్యూనిస్టులు కంకణబద్దులు కావలసిన తక్షణవసరం ఉందని అన్నారు. అనంతరం పార్టీ నియమాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లె మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ సిపిఐ మదనపల్లె పట్టణ కార్యదర్శి జి చంద్రశేఖర్ మాధవ్ శాఖ కార్యదర్శి కే సిద్దయ్య గోపాల్ నిళవతి రాజమ్మ భాగ్యమ్మ వెంకటమ్మ పాపుల్లమ్మ శివుణ్ణి మల్లేష్ గజేంద్ర రమణమ్మ నాగరత్నమ్మ క్రిష్ణప్ప మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News