Wednesday, 29 July 2026 05:21:55 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

భారత చైతన్య యోజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా న్యాయవాది పూల ప్రేమ్ కుమార్

Date : 01 February 2026 09:13 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 01 : భారత చైతన్య యోజన పార్టీ ఆంధ్రప్రదేశ్ యూత్ విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా పూల ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం, యువతలో ఆయనకున్న ఆదరణను పరిగణలోకి తీసుకొని బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ ఈ పదవిని కేటాయించారు. పుంగనూరు కు చెందిన న్యాయవాది పూల ప్రేమ్ కుమార్ బాల్యం నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో స్వయంసేవక్ గా ఉండి అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు, గో సంరక్షణలో భాగంగా, హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చురుగ్గా పాల్గొంటూ జాతీయ భావాలతో హిందూ ధర్మ సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు, అదేవిధంగా విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల విద్యార్థుల సమస్యల పైన అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కేంద్రంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు, స్వతంత్ర సమరయోధుల జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులలో జాతీయ భావాలను పెంచేలా పని చెయ్యటం మరియూ విద్యార్థుల హాస్టల్ వసతి, భోజన వసతి, తరగతి గదుల్లో విద్య లాంటి అన్ని సౌకర్యలు విద్యార్థులకు అందేలా ఉన్నంతధికారులతో చర్చించి విద్యార్థులకు అండగా ఉండేవారు, క్రీడారంగంలో విద్యార్థులు చురుకుగా ఉండేలా ప్రత్సహించటం, యువత రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించటం, ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని అవగాహనా సదస్సులు, చార్చ కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యటం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. పూల ప్రేమ్ కుమార్ గతంలో భారతీయ జనతా పార్టీ పుంగనూరు నియోజకవర్గం కో - కన్వీనర్ గా కూడా చురుగ్గా పని చేసారు, బోడె రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు మరియూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విధానాలకు చూసి రైతులు, మహిళలు, నిరుద్యోగుల పట్ల, పేదల పక్షాన ఉద్యమిస్తున్న విధానాలు నచ్చి 2025 న భారత చైతన్య యోజన పార్టీలో చేరినారు. బోడే రామచంద్ర యాదవ్ గారు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ వారి పోరాటాలు, ఉద్యమాలలో చురుగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారత చైతన్య యోజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా పూల ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు అని పార్టీ నాయకులు తెలియచేస్తూ పార్టీ అభ్యున్నతి మరింత కృషి చేయాలని తెలియచేసారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: