Saturday, 12 September 2026 04:30:50 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఒకరికి యువకుడికి స్వల్ప గాయాలు, మరొకరు బెంగళూరుకు తరలింపు

Date : 12 September 2026 11:08 AM Views : 12

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : బి . కొత్తకోట - సెప్టెంబర్ 12 : బి.కొత్తకోట మండలంలో నాయని బావి వద్ద శనివారం ఉదయం ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ యువకుడి కాలు తీవ్రంగా దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు నాయినబావి పంచాయతీ కాయలవారిపల్లికి చెందిన రాజేంద్ర (23), హరికృష్ణ (28)లు బైక్‌పై కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంతకు బయలుదేరారు. మార్గమధ్యంలోని నాయినబావి కోళ్ల ఫారం వద్దకు చేరుకోగానే పొలం నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తున్న ట్రాక్టర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ కాలు తీవ్రంగా గాయపడగా, రాజేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించిన అనంతరం హరికృష్ణను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :