నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తాం -- ఈనెల 12 తర్వాత ఎప్పుడైనా 108 ఉద్యోగుల సమ్మె -- సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ నెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైన సమ్మె కు వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షులు ఎ. రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ చలపతి లు పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన అనంతరం డి.ఆర్. ఓ మధుసూదన్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు విలేకరుల తో మాట్లాడుతూ ప్రభుత్వం వేతనం రూ. 4,000 లు పెంచుతూ జి. ఓ నంబర్ 49 ఇచ్చినప్పటికి పూర్తి స్థాయి వేతనం అమలు చేయకుండా కేవలం రూ 2 వేలే ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుండి పిఎఫ్ కట్ చేసుకుని యాజమాన్యం వాటా పిఎఫ్ బ్యాంక్ ఖాతా కు జమచేయకపోవడం ఉద్యోగులను మోసం చేసే దుర్మార్గపు చర్య గా పేర్కొన్నారు. ఒక్కొక్క నెలలో కొందరికి కారణం తెలపకుండా వేతనం తగ్గించి ఇస్తున్నారని, కనీసం పేస్లిప్ కూడా ఇవ్వకుండా వ్యవహారిస్తున్నా, భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమని, చిన్న.. చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 18 ఏళ్ల నుండి సర్వీసు ఉన్న వారికి మళ్ళీ పరీక్ష నెగ్గడం ద్వారా నియామకం పొడిగిస్తామనడం ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి, 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి స్లాబ్ అప్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీ డి ఏ అలవెన్స్ లు క్రమం తప్పకుండ ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు అమలు చేయాలని పేర్కొన్నారు. పని చేసే ప్రదేశం లో షెల్టర్ వాహన క్లీనింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, 8 గంటలు పని అమలు చేయాలని కోరారు. వాహన మరమ్మతులు సిబ్బంది కాకుండా ప్రభుత్వం చేయించి సిబ్బంది కి అప్పుల ఉపశమనం కలిగించాలని కోరారు. జిల్లా కు ఒకటి కాకుండా డివిజన్ కి ఒక గ్యారేజ్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా నలుమూలల నుండి 108 సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో రైటప్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న 108 ఉద్యోగులు
Reporter
Namitha News