నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 08 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడం నిరుపేదల పాలిట ఆశాజ్యోతి గా నిలిచిందని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, రాజంపేట రైతు సంఘం నాయకుడు వెంకటరెడ్డిలు కొనియాడారు. బుదవారం మండలంలోని బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలోని పలువురికి వారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆర్థిక స్తోమత లేక చికిత్సలు పొంది ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడం తో ఉపశమనం పొందామని జీవితాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని భావోద్వేగంతో చెప్పారు. వారి వెంట టిడిపి సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, కన్నె మడుగు గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేంద్ర, ఎర్రసానిపల్లి సుధాకర్, నరేంద్ర నాయుడు, సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు
Reporter
Namitha News