నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 30 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండ శివాలయం సోమవారం వందలాది భక్తుల తో కిటకిటలాడింది. ఉదయం మహాశివునికి ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ప్రత్యేక పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మహా శివుని దర్శనం తో పాటు కొండపై వెలసిన గౌరీ మాత ఆలయం, వీరన్నగెవి, నిచ్చెన కొండ, భగీరథి, ఎలకతీర్థం తో పాటు వెలుగు మల్లమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు టెంపుల్ రికార్డ్ అసిస్టెంట్ కొండ కిట్ట సిబ్బంది సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Reporter
Namitha News