Thursday, 16 April 2026 04:56:27 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి సిపిఐ నాయకులు డిమాండ్

Date : 02 June 2025 03:18 PM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి సిపిఐ నాయకులు డిమాండ్ అర్హులైన పేదలందరికీ పట్టణాలలో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మణానికి 5 లక్షలు ఇవ్వాలని,"సూపర్ సిక్స్" హామీలు అమలు చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబ శివ, కృష్ణప్ప,నియోజవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని తుంగలో తొక్కుతున్నారని,సచివాలయాల పైన కూటమి నాయకుల పెత్తనం పెరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని, కడప బెంగుళూరు రైల్వే లైన్ మదనపల్లి మీదుగానే కొనసాగిస్తామని, బిటి కళాశాలను యూనివర్సిటీగా చేస్తామని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి,ప్రభుత్వ మెడికల్ కళాశాలను పి 4 విధానంలో మార్చారని, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలలు ఇవ్వాలని, మదనపల్లి జిల్లా గా ప్రకటించాలని, బిటి కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలని,కడప బెంగుళూరు రైల్వే లైను పనులు వెంటనే ప్రారంభించాలని,మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర,సూరి,దేవా,తిరుమల,మస్తాన్,వాసు తదితరులు పాల్గొన్నారు.

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి సిపిఐ నాయకులు డిమాండ్

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :