Sunday, 13 September 2026 02:48:06 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం కూలీలకు ఓవరం - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 06 March 2026 10:21 PM Views : 289

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 06 : వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం ద్వారా జరిగే పనులు కూలీలకు ఓ వరంలా నిలవాలని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం సూచించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పై సమీక్ష నిర్వహించారు. మండలంలో నూతన ఉపాధి హామీ చట్టంపై ఆరు వారాల అవగాహన సదస్సుల నిర్వహణ పై ఆరా తీశారు. ఉపాధి హామీలో 125 రోజులు పెంచిన పని దినాలు, ప్రతి ఒక్కరికి పని కల్పించి వారాంతంలో బిల్లు చెల్లింపు, నిరుద్యోగ భృతి, ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో భవిష్యత్తు ప్రణాళిక స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు పోవాలన్నారు. నూతన ఉపాధి చట్టం పై గోడ రాతలు, విద్యార్థులచే అవగాహన ర్యాలీలు, పాఠశాలలలో విద్యార్థులకు వికసిత్ భారత్ పై పోటీలు నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పనులు ఫారం పాండ్స్, చెరువుల కాలువల మరమ్మతులు, పండ్ల తోటల పెంపకం, పశువుల గడ్డి పెంపకానికి ప్రాధాన్యత నివాళులున్నారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత,భూదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :