నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి- ఏప్రిల్ 23 : మదనపల్లి పట్టణం SBI కాలనీ గొల్లపల్లి నందు దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీ మహమ్మారెమ్మ తల్లి దేవస్థానం ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబూ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం లో , దేవస్థానం అధ్యక్షులు బొమ్మాడి రామకృష్ణ, సెక్రటరీ గంగసాని మస్తాన్ రెడ్డి, ట్రెజరర్ భవాని శ్రీను, వైస్ ప్రెసిడెంట్ కొండపల్లి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ s.మాధవ్ రెడ్డి, కో- ట్రెజరర్ వెంకటరమణ, ఆలయ ట్రస్టీలు వెంకటేశ్వర రెడ్డి, శ్రీరామ్ సహదేవ నాయుడు, వెంకట్రాయుడు మరియు జేసీ రెడ్డప్ప,మల్లి , తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News