నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : తంబళ్లపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయం తో పాటు సచివాలయాలలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తంబళ్లపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థతో గ్రామపంచాయతీలు పటిష్టంగా తయారై గాంధీజీ కలలు నెరవేరుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సమస్యలు అధికారులు దృష్టికి తెచ్చి పరిష్కారానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అంజనప్ప,కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకటరమణ,సోమశేఖర్ రెడ్డి, మంజుల, పద్మావతి, భాస్కర్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News