Monday, 14 September 2026 04:46:11 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఓటర్ల నమోదు ప్రక్రియ తర్వాత సెప్టెంబర్ 22 తుది జాబితా - ఎన్నికల అధికారి మాధవ కృష్ణారెడ్డి

Date : 22 May 2026 09:21 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఓటర్ల నమోదు, పరిశీలన ప్రక్రియ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి మాధవ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుందని జులై 21వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 21వ తేదీ వరకు అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 18 వరకు మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సెప్టెంబర్ 22వ తేదీన తంబళ్లపల్లె నియోజకవర్గం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. జులై 14వ తేదీ నుండి ఒక పోలింగ్ బూత్ లో 1200 ఓట్లకు మించి ఓటర్లు ఉంటే ఓటర్ల జాబితా పరిశీలించి ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్నుమలేటర్లు, సూపర్వైజర్లు ముమ్మరంగా పాల్గొని ఎలాంటి పొరపాట్లు లేకుండా నికాసైన ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకుడు సిద్ధమల్ రెడ్డి, బిజెపి నాయకులు గోపాల్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు రమణ, కూటమి నాయకులు పాల్గొనగా వైకాపా నాయకులు గైర్హాజరయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :