నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 08 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైఎస్ఆర్సిపి యూత్ జాయింట్ సెక్రెటరీ పి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైయస్సార్ అమర్ రహే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని సంక్షేమ పథకాల ఆధ్యుడు వైయస్సార్ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడని కొనియాడారు. అనంతరం కోసువారిపల్లె పీహెచ్సీలో రోగులకు పాలు పండ్లు పంపిణీ తో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News