Wednesday, 29 July 2026 11:06:05 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సెక్యూరిటీ సిబ్బందిపై వివక్ష ఆపాలి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలి

Date : 14 May 2026 03:04 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సెక్యూరిటీ సిబ్బందిపై వివక్ష ఆపాలి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు విశాలాంధ్ర , మదనపల్లి: మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని, సెక్యూరిటీ సిబ్బంది హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏఐటీయూసీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాధికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డ్యూటీ ముగిసిన తర్వాత మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగిస్తున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బందిపైన మాత్రమే ఈ నిబంధనలు అమలు చేయడం స్పష్టమైన వివక్షతకు నిదర్శనమన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానం రాష్ట్రంలోనే కాక దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ విధానం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అత్యవసర కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సంప్రదింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సెక్యూరిటీ సిబ్బందిపై అమలు చేస్తున్న వివక్షతపూరిత విధానాలను వెంటనే నిలిపివేయాలని, కార్మికుల సెల్ ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన నిబంధనలు అమలు చేయాలని కోరారు. కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్న సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ సిబ్బందికి గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, రవి తదితరులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: