నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 30 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “ఇండస్ట్రీ 5.0 కోసం మానవ మరియు యంత్ర భవిష్యత్తును రూపకల్పన చేయడం” అనే అంశంపై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పూర్ణేన్దు సిన్హా, ప్రొఫెసర్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ పరిశ్రమల్లో యంత్రాలు మాత్రమే కాకుండా, మనుషుల మేధస్సు మరియు కృత్రిమ మేధస్సు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ పరికరాల సహాయంతో పరిశ్రమలలో పనితీరు మరింత మెరుగుపడటమే కాకుండా, ఉత్పత్తి ప్రక్రియలు సురక్షితంగా మరియు సమర్థవంతంగా మారుతాయని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 వేగం మరియు ఆటోమేషన్పై దృష్టి పెట్టగా, ఇండస్ట్రీ 5.0 మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుందని, కోబోట్స్ (Cobots) వంటి సాంకేతికతలతో మనుషులు మరియు యంత్రాలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి సాధించడం, డేటా అనలిటిక్స్ మరియు రోబోటిక్స్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సాధ్వినియిగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కోఆర్డినేటర్ జి.ముత్తు గురునాథన్, డాక్టర్ ఆర్. నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News