Monday, 14 September 2026 08:33:55 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో భవిష్యత్తులో ఇండస్ట్రీ లో యంత్రాలే కాకుండా మానవ మేధస్సు చర్చ

Date : 30 March 2026 05:40 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 30 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “ఇండస్ట్రీ 5.0 కోసం మానవ మరియు యంత్ర భవిష్యత్తును రూపకల్పన చేయడం” అనే అంశంపై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పూర్ణేన్దు సిన్హా, ప్రొఫెసర్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ పరిశ్రమల్లో యంత్రాలు మాత్రమే కాకుండా, మనుషుల మేధస్సు మరియు కృత్రిమ మేధస్సు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ పరికరాల సహాయంతో పరిశ్రమలలో పనితీరు మరింత మెరుగుపడటమే కాకుండా, ఉత్పత్తి ప్రక్రియలు సురక్షితంగా మరియు సమర్థవంతంగా మారుతాయని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 వేగం మరియు ఆటోమేషన్‌పై దృష్టి పెట్టగా, ఇండస్ట్రీ 5.0 మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుందని, కోబోట్స్ (Cobots) వంటి సాంకేతికతలతో మనుషులు మరియు యంత్రాలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి సాధించడం, డేటా అనలిటిక్స్ మరియు రోబోటిక్స్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సాధ్వినియిగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కోఆర్డినేటర్ జి.ముత్తు గురునాథన్, డాక్టర్ ఆర్. నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :