Thursday, 16 April 2026 03:18:58 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో భవిష్యత్తులో ఇండస్ట్రీ లో యంత్రాలే కాకుండా మానవ మేధస్సు చర్చ

Date : 30 March 2026 05:40 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 30 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “ఇండస్ట్రీ 5.0 కోసం మానవ మరియు యంత్ర భవిష్యత్తును రూపకల్పన చేయడం” అనే అంశంపై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పూర్ణేన్దు సిన్హా, ప్రొఫెసర్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ పరిశ్రమల్లో యంత్రాలు మాత్రమే కాకుండా, మనుషుల మేధస్సు మరియు కృత్రిమ మేధస్సు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ పరికరాల సహాయంతో పరిశ్రమలలో పనితీరు మరింత మెరుగుపడటమే కాకుండా, ఉత్పత్తి ప్రక్రియలు సురక్షితంగా మరియు సమర్థవంతంగా మారుతాయని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 వేగం మరియు ఆటోమేషన్‌పై దృష్టి పెట్టగా, ఇండస్ట్రీ 5.0 మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుందని, కోబోట్స్ (Cobots) వంటి సాంకేతికతలతో మనుషులు మరియు యంత్రాలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి సాధించడం, డేటా అనలిటిక్స్ మరియు రోబోటిక్స్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సాధ్వినియిగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కోఆర్డినేటర్ జి.ముత్తు గురునాథన్, డాక్టర్ ఆర్. నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :