నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుపతి - నవంబర్ 06 : గురువారం తిరుపతి ఎస్.వి యూనివర్సిటీ గ్రౌండ్ నందు జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్.జి.ఎఫ్ అండర్ 17 అథ్లెటిక్ పోటీలలో చెంబకూరు జడ్పి హై స్కూల్ విద్యార్థి తరుణ్ కుమార్ రాజు ప్రత్యేక ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ నెలలో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తరపున ఆడనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ దిలీప్ కుమార్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News