నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 01 : చిత్తూరు జిల్లా పుంగనూరు మండల టిడిపి అధ్యక్ష పదవికి సోమవారం దరఖాస్తు సమర్పించిన సుబ్రహ్మణ్యం రాజు. ఈ సందర్బంగా కోలార్ రాజు మాట్లాడుతూ ప్రతి పంచాయతీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్న, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం మరియు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆశయాల కోసం నాసర్వశక్తుల ద్వారా పనిచేశాను. ప్రతిపక్షంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టినా, నేను ఎక్కడా తగ్గకుండా, ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా, పార్టీ భవిష్యత్తు కోసం మరియు పుంగనూరు ప్రజల ఆశయాలను గౌరవిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాను. మన పార్టీ అధికారంలో ఉన్నా కొంతమంది కార్యకర్తలు ఇంకా నిరాశ, నిస్పృహలో ఉన్నారు. మీ కోసమూ మరియు మన పార్టీ సిద్ధాంతాల కోసం మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని కోరుతున్నాను. మీకు ఎల్లప్పుడూ తోడుగా, మీ గ్రామాలను మరింత అభివృద్ధి చేయడంలో మన పార్టీని నమ్ముతున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా, మీతో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండి మీ వద్దకు వచ్చాను. దయవుంచి నాకు మీకు సేవ చేసే అవకాశం కల్పించేందుకు మరియు నాపై ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నానని తెలిపారు.
Reporter
Namitha News