Friday, 19 June 2026 03:18:43 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

Date : 03 May 2026 07:38 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 03 : మదనపల్లి పట్టణం సమీపం అంగళ్ళు లో నున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశం కొరకు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను ఘనంగా నిర్వహించామని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఆన్లైన్ పరీక్షకు సుమారు 2000 మంది విద్యార్థులు 9 కేంద్రాలలో హాజరై పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. మదనపల్లె, కడప, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, చిత్తూర్, తిరుపతి, హిందూపూర్ మరియు విజయవాడ కేంద్రాలలో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ లోని వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, చాకచక్యంగా పరీక్షలో పాల్గొన్నారని ఆయన అభినందించారు. ఈ పరీక్షను ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో, ప్రతి సెషన్ రెండు గంటల పాటు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షా నిర్వహణలో సాంకేతిక మరియు పరిపాలనా సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఉపకులపతి పేర్కొన్నారు. అలాగే ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకానాథ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథం, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొని పరీక్ష నిర్వహణ లో పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :