Sunday, 03 May 2026 10:17:42 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

Date : 03 May 2026 07:38 PM Views : 8

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 03 : మదనపల్లి పట్టణం సమీపం అంగళ్ళు లో నున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశం కొరకు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను ఘనంగా నిర్వహించామని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఆన్లైన్ పరీక్షకు సుమారు 2000 మంది విద్యార్థులు 9 కేంద్రాలలో హాజరై పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. మదనపల్లె, కడప, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, చిత్తూర్, తిరుపతి, హిందూపూర్ మరియు విజయవాడ కేంద్రాలలో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ లోని వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, చాకచక్యంగా పరీక్షలో పాల్గొన్నారని ఆయన అభినందించారు. ఈ పరీక్షను ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో, ప్రతి సెషన్ రెండు గంటల పాటు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షా నిర్వహణలో సాంకేతిక మరియు పరిపాలనా సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఉపకులపతి పేర్కొన్నారు. అలాగే ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకానాథ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథం, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొని పరీక్ష నిర్వహణ లో పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: