నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : రామసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలోని హరితా డిజేబుల్ ఓల్డెజ్ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులు సోమశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు నడుమ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. ముఖ్య అతిధులుగా ఫాదర్ డాక్టర్ చంద్ర కిరణ్, ఫాదర్ ఫీటర్ విచ్చేసి శాంతి ప్రార్థనలు నిర్వహించారు. వీరు మాట్లాడుతూ శాంతి, కరుణ,దయ ఓర్పు వంటి సమాజ హిత లక్ష్మణా లను జీసస్ ప్రభోదించారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్దలకు, పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. విందు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నా డాక్టర్ చంద్రకిరణ్, ఫీటర్, సోమశేఖర్, హరిత, బాబు, వివేక్,జో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News